పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-28T05:27:04+05:30 IST
కడుపు నొప్పి భరించలేక ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
కొండపాక, నవంబరు 27: కడుపు నొప్పి భరించలేక ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని రామునిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. రామునిపల్లి గ్రామానికి చెందిన చింతల పూజ(17) గత మూడేళ్లుగా నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నది. ఎంతకూ తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రాత్రికి ఆర్వీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి సిద్ధయ్య ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.