కడుపు నొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-08T04:55:14+05:30 IST

కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వీరాపూర్‌ గ్రామంలో జరిగింది.

కడుపు నొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

 బెజ్జంకి, అక్టోబరు 7: కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వీరాపూర్‌ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరాపూర్‌ గ్రామానికి చెందిన ముత్యాల తిరుపతిరెడ్డి(45) మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకొని మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిరెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


 

Updated Date - 2021-10-08T04:55:14+05:30 IST