సిద్దిపేట పురపోరుకు 575 నామినేషన్లు
ABN , First Publish Date - 2021-04-19T06:07:06+05:30 IST
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన ఆదివారం అభ్యర్థులు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు. 43 వార్డులకు 575 నామినేషన్లను వచ్చాయి. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంతో ఆశావహుల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల్లో టిక్కెట్ ఎవరికి దక్కుతుందోనన్న టెన్షన్ మొదలైంది.