కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంగారెడ్డి వాసి

ABN , First Publish Date - 2021-12-30T05:44:16+05:30 IST

కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంగారెడ్డికి చెందిన రంగనాథ్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంగారెడ్డి వాసి

సంగారెడ్డిటౌన్‌, డిసెంబరు 29: కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంగారెడ్డికి చెందిన రంగనాథ్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 2017 ఇండియన్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ సర్వీ్‌సకు చెందిన రంగనాథ్‌ 2017 నుంచి 2021 వరకు హైదరాబాద్‌, విశాఖపట్నం జోన్లలోని జీఎ్‌సటీ ఆడిట్‌ కమిషనరేట్లలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన రంగనాథ్‌ కేంద్ర ఆర్థికశాఖలో పదవీబాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డికి చెందిన అవడం రంగనాథ్‌ స్థానికంగా ఉన్న సరస్వతి శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన రంగనాథ్‌ కేంద్ర ఆర్థికశాఖలో బాధ్యతలు చేపట్టిన సందర్బంగా సంగారెడ్డి పట్టణవాసులతో పాటు అతని మిత్రులు బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-12-30T05:44:16+05:30 IST