Sangareddy: ఇంట్లో నుంచి పారిపోయిన ముగ్గురు చిన్నారులు

ABN , First Publish Date - 2021-12-11T16:07:29+05:30 IST

తల్లిదండ్రులు మందలించారంటూ ముగ్గురు చిన్నారులు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

Sangareddy: ఇంట్లో నుంచి పారిపోయిన ముగ్గురు చిన్నారులు

సంగారెడ్డి: తల్లిదండ్రులు మందలించారంటూ ముగ్గురు చిన్నారులు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పఠాన్ చెరు పట్టణంలోని గౌతమ్ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయారు.  దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారుల కోసం వెతికి చివరకు అర్ధరాత్రి దాటాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారుల కోసం గాలించి... నిర్మానుశ్య ప్రదేశంలో దాగి ఉన్న పిల్లల్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. బడికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు  పిల్లల్ని మందలించడం వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

Updated Date - 2021-12-11T16:07:29+05:30 IST