ఉమ్మడి జిల్లాలో 125 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2021-06-19T05:56:02+05:30 IST
సిద్దిపేట జిల్లాలో శుక్రవారం 5,568 మందికి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 80 మందికి పాజిటివ్గా తేలింది.
సిద్దిపేట/సంగారెడ్డిఅర్బన్/మెదక్అర్బన్, జూన్ 18: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం 5,568 మందికి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 80 మందికి పాజిటివ్గా తేలింది. సంగారెడ్డి జిల్లాలో 18 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలాగే 1,457 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 61 మంది, పటాన్చెరు ఆస్పత్రి నుంచి 70మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్ నిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రికి పంపారు. మెదక్ జిల్లాలో 1,173 మందికి నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో 27 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది.