పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-09-19T04:20:27+05:30 IST
చెరువులో దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం మంబోజిపల్లిలో శనివారం చోటు చేసుకున్నది.
పదేళ్ల క్రితం ఓ కేసులో సర్వీస్ నుంచి తొలగింపు
మెదక్ రూరల్, సెప్టెంబరు 18 : చెరువులో దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం మంబోజిపల్లిలో శనివారం చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం మాచవరం గ్రామానికి చెందిన రామాంజనేయులు (53) గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించాడు. పదేళ్ల క్రితం ఓ కేసులో నేరం రుజువు కావడంతో సర్వీస్ నుంచి తొలగించారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. రెండేళ్లుగా భార్య కూడా దూరంగానే ఉంటుంది. రామాంజనేయులు మాచవరంలోని తల్లి నాగేంద్రమ్మతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం మంబోజిపల్లి ఊర చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. మృతుడు రామాంజనేయులుగా గుర్తించారు. కొంతకాలంగా మానసిక స్థితి బాగలేకపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితులు, కుటుంబానికి దూరంగా ఉండడం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదు మేరకు మెదక్ రూరల్ ఎస్ఐ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.