ప్రతిపక్షాల డ్రామాలను ప్రజలు విశ్వసించరు
ABN , First Publish Date - 2021-10-30T04:29:06+05:30 IST
రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న డ్రామాలను ప్రజలు విశ్వసించరని చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ అంకుగారి శ్రీధర్రెడ్డి అన్నారు.
చేర్యాల, అక్టోబరు 29: రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న డ్రామాలను ప్రజలు విశ్వసించరని చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ అంకుగారి శ్రీధర్రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎ్సపై అసత్య ప్రచారం చేసినా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో మునిసిపల్ వైస్చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య, పార్టీ పట్టణాధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు మంగోలు చంటి, నాయకులు రామగల్ల బాబు, శివగారి అంజయ్య, చింతల పర్షరాములు, బూరగోని తిరుపతి, యాట భిక్షపతి పాల్గొన్నారు.