సుల్తాన్పూర్ జేఎన్టీయూలో బీ ఫార్మసీ కళాశాల ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST
జేఎన్టీయూ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి బీ ఫార్మసీ కళాశాల ప్రారంభమైంది.
పుల్కల్, డిసెంబరు 1: జేఎన్టీయూ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి బీ ఫార్మసీ కళాశాల ప్రారంభమైంది. సుల్తాన్పూర్ వద్ద గల జేఎన్టీయూలో కొత్తగా ఏర్పాటైన బీ ఫార్మసీ కళాశాలను జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్తో కలిసి కళాశాల భవనాన్ని బుధవారం ప్రారంభించారు. కళాశాల ఆవరణలో వివిధ రకాలకు చెందిన పండ్ల మొక్కలను నాటి నీళ్లు పోశారు. అనంతరం బీ ఫార్మసి చదివే విద్యార్థులకు కేటాయించనున్న వసతిగృహ సముదాయాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఆకాడమిక్స్ అండ్ ప్లానింగ్ మాధవీలత, చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్రావు, డైరెక్టర్ ఆఫ్ ఐఎ్సటీ శశికళ, కళాశాల ప్రిన్సిపాల్ జీఎన్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహ, బీఫార్మసీ కళాఽఽఽశాల ప్రిన్సిపాల్ ఎం.అజిత, ఫిజికల్ డైరెక్టర్ దిలీప్, రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.