కారు, ఆటో ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.

కారు, ఆటో ఢీకొని ఒకరి మృతి

కౌడిపల్లి, డిసెంబరు 25 : కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం కంగ్టి మండలంలోని డి బాన్సువాడకు చెందిన రాములు (48) కుటుంబసభ్యులతో కలిసి మెదక్‌ చర్చికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో మెదక్‌ నుంచి ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఆటోను బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నర్సాపూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా రాములు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కౌడిపల్లి ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST