డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు
ABN , First Publish Date - 2021-07-25T04:39:57+05:30 IST
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీట్ ద కొవిడ్, ఈచ్ వన్ రీచ్ వన్ కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

సిద్దిపేట ఎడ్యుకేషన్, జూలై 24: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీట్ ద కొవిడ్, ఈచ్ వన్ రీచ్ వన్ కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో సుమారు 157విద్యా సంస్థలు పోటీపడగా 14విద్యా సంస్థలకు గుర్తింపు పత్రాలను అందించారు. ఇందులో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండడం విశేషం. కొవిడ్ సందర్భంగా తలెత్తిన సవాళ్లను విద్యా సంస్థలు ఏ విధంగా స్వీకరించాయి, సమాజానికి ఎటువంటి సేవలు అందించాయి అనే అంశాన్ని ప్రామాణికంగా చేసుకొని ప్రణాళికల రూపకల్పన వాటిని అమలు చేయడంలో విద్యార్థుల భాగస్వామ్యం ఆధారంగా చేసుకొని కళాశాలను ఎంపిక చేశారు.