Telangana: ఏడుపాయల వనదుర్గమాత ఆలయం మూసివేత
ABN , First Publish Date - 2021-09-07T15:54:40+05:30 IST
జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు నిర్వహించనున్నారు. ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాలకు ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. సింగూరు నుండి దిగువకు నీరు విడుదలడంతో ఆలయంలోకి వరద వచ్చే అవకాశం ఉండడంతో మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.