అర్హులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అందించాలి : సంజీవరెడ్డి

ABN , First Publish Date - 2021-10-22T05:15:33+05:30 IST

అర్హులందరికీ పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అందజేయాలని టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి అన్నారు.

అర్హులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అందించాలి : సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌, అక్టోబరు 21 : అర్హులందరికీ పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అందజేయాలని టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖేడ్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబాకర్‌ పథకాలను కాంగ్రె్‌సలో ఉన్నారంటూ పలు గ్రామాల్లో లబ్ధిదారులకు అందించడం లేదన్నారు. 2019లో వివాహాలు జరిగినా ఇప్పటికీ ఆర్థిక సహాయం అందలేదని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, అర్హులైన వారికి ఇవ్వాలని ఆదేశాలిచ్చారని అన్నారు. అయితే స్థానిక నాయకులు మాత్రం తమ పార్టీలో చేరితేనే ఇస్తామని తెలుపుతున్నారన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి డీఏవో చంద్రకళకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు దరఖాస్తు చేసుకున్నా సహాయం అందని వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆనంద్‌ స్వరూ్‌పషెట్కార్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు సాగర్‌షెట్కార్‌, మాజీ ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు లక్ష్మి, చందర్‌నాయక్‌, బోజిరెడ్డి, మనూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌, తాహేర్‌అలీ, దామ నాగన్న, కృష్ణ, మనోహర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:15:33+05:30 IST