ప్రజల హృదయాల్లో నిలిచిన జాన్‌విల్సన్‌

ABN , First Publish Date - 2021-12-20T04:45:24+05:30 IST

ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేసి వారి హృదయాల్లో నిలిచిపోయిన పోలీస్‌ అమరవీరుడు ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ అని ఎస్‌ఐ శ్రీధర్‌ అన్నారు.

ప్రజల హృదయాల్లో నిలిచిన జాన్‌విల్సన్‌

హుస్నాబాద్‌ రూరల్‌, డిసెంబరు 19: ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేసి వారి హృదయాల్లో నిలిచిపోయిన పోలీస్‌ అమరవీరుడు ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ అని ఎస్‌ఐ శ్రీధర్‌ అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో సీఐ యాదగిరి, ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపుల్స్‌వార్‌ పేల్చిన మందుపాతరలో సీఐ యాదగిరి, ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ మరణించి 30 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. అనంతరం జాన్‌విల్సన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అనాఽథ వృద్ధులకు, ఒంటరి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఇందులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T04:45:24+05:30 IST