ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-05-09T04:55:41+05:30 IST
ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు

ఎమ్మెల్యే మాణిక్రావు
ఝరాసంగం, మే 8: ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. శనివారం ఝరాసంగం మండలంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీముభారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమపథకాలను అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జగదీశ్వర్, ఎంపీటీసీ రజనిప్రియ, నాయకులు ఏజాజ్ బాబా, రామారావు పాల్గొన్నారు.