కారును ఢీకొన్న డీసీఎం వ్యాను.. ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2021-08-27T05:30:00+05:30 IST
మండలంలోని మేదినీపూర్ స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
![కారును ఢీకొన్న డీసీఎం వ్యాను.. ఐదుగురికి గాయాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/192108271150534/08282021000032n40.jpg)
కొండపాక, ఆగస్టు 27: మండలంలోని మేదినీపూర్ స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారును మేదినీపూర్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. స్వామి అనే వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొంది పెద్దపల్లికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో కావేటి శ్రీకాంత్, శివ, శిరీష, ప్రశాంతి, స్వామి ఉన్నారు. సమాచారమందుకున్న 108 సిబ్బంది వెంటనే చేరుకుని క్షతగాత్రులను సిద్దిపేట ఆస్పత్రిలో చేర్పించారు.