సంగారెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా
ABN , First Publish Date - 2021-12-30T19:59:53+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది.
![సంగారెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సంగారెడ్డి అర్బన్/మెదక్ అర్బన్, డిసెంబరు 29 : సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇందులో భాగంగా జిల్లాలోని పటాన్చెరులో ఒకరికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన ఒకరు హోంఐసోలేషన్లో ఉన్నారు. అలాగే 411 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశామని వైద్యాఽధికారులు తెలిపారు. మెదక్ జిల్లావ్యాప్తంగా 256 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా.. ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,357కు చేరింది.