సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కృషి

ABN , First Publish Date - 2021-08-04T03:44:25+05:30 IST

సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కృషి

 తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి


గజ్వేల్‌, జూలై 3: సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ, 57 ఏళ్లకే పింఛన్‌, దళితబంధు ప్రకటించినందుకు గజ్వేల్‌ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంగళవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ జకీ, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, అత్తెల్లి శ్రీనివాస్‌, రహీం, బాలమణి, రజిత, శ్రీనివాస్‌, చందు, నాయకులు గుంటుకు రాజు, నాగులు, ప్రవీణ్‌, నవాజ్‌మీరా, సాయి, పరమేశ్వరాచారీ, శ్రీధర్‌, మల్లేశం, ఉమర్‌, కనకయ్య, అహ్మద్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-08-04T03:44:25+05:30 IST