గోవులను అక్రమ రవాణా చేస్తే కేసులు: డీఎస్పీ
ABN , First Publish Date - 2021-07-13T05:13:45+05:30 IST
ఆవులు, లేగదూడలను ఎవరైనా అక్రమంగా అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి డీఎస్పీ బాలాజి హెచ్చరించారు.
![గోవులను అక్రమ రవాణా చేస్తే కేసులు: డీఎస్పీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సంగారెడ్డి క్రైం, జూలై 12: ఆవులు, లేగదూడలను ఎవరైనా అక్రమంగా అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి డీఎస్పీ బాలాజి హెచ్చరించారు. సంగారెడ్డిలో పశువుల సంతను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ సందర్బంగా ఆవులు, లేగ దూడలను ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా, అక్రమ రవాణా చేసినా చట్టరీత్యా చర్యలకు బాధ్యులవుతారని అన్నారు. ఆయన వెంట సీఐ శివలింగం, ఎస్ఐ సుభాష్ ఉన్నారు.