పాఠశాల సామగ్రిని ఎత్తుకెళ్లింది బీజేపీ నేతలే!

ABN , First Publish Date - 2021-07-13T05:03:19+05:30 IST

కస్తూర్బా పాఠశాల సామగ్రిని ఎత్తుకెళ్లింది బీజేపీ నేతలేనని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తొగుట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అనిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ కనకయ్య డిమాండ్‌ చేశారు.

పాఠశాల సామగ్రిని ఎత్తుకెళ్లింది బీజేపీ నేతలే!
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌

తొగుట, జూలై 12 : కస్తూర్బా పాఠశాల సామగ్రిని ఎత్తుకెళ్లింది బీజేపీ నేతలేనని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తొగుట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అనిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ కనకయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం తొగుట మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వారే ఇలా ప్రభుత్వ సొమ్మును ఎత్తుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. తొగుట కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ3.5 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ దేవునూరి పోచయ్య, మాజీ పార్టీ అధ్యక్షుడు కుంబాల శ్రీనివాస్‌, ఎంపీటీసీ కొమ్ము శరత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T05:03:19+05:30 IST