డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
ABN , First Publish Date - 2021-10-30T04:28:31+05:30 IST
మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం ఎంపీపీ తాండ పాండుగౌడ్, జడ్పీటీసీ యెంబరి మంగమ్మరాంచంద్రంయాదవ్, సర్పంచ్ పాములపర్తి తిర్మల్రెడ్డి, వైస్ ఎంపీపీ మంద బాల్రెడ్డి భూమి పూజ చేశారు.

జగదేవ్పూర్, అక్టోబరు 29: మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం ఎంపీపీ తాండ పాండుగౌడ్, జడ్పీటీసీ యెంబరి మంగమ్మరాంచంద్రంయాదవ్, సర్పంచ్ పాములపర్తి తిర్మల్రెడ్డి, వైస్ ఎంపీపీ మంద బాల్రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఇంతకు ముందు 50 ఇళ్లను నిర్మించారని, ప్రస్తుతం 100 ఇళ్లను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం ఆలయ చైర్మన్ హరిపంతులు, తహసీల్దార్ ఆరీఫా, పంచాయతీ కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్ పద్మనర్సింలు, వార్డు సభ్యులు ప్రభాకర్, లక్ష్మీ నాగరాజు, మల్లేష్, కాంట్రాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, నాయకులు మధుసూదన్, బాల స్వామి తదితరులున్నారు.