కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-30T04:26:46+05:30 IST

ఇందిరాక్రాంతి పథకంలో వీవోఏలుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వీవీ నర్సింహ్మ కోరారు.

కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి
డీఆర్‌డీవో పీడీ ఉమాదేవికి వినతి పత్రం అందిస్తున్న వీవోఏలు

- డీఆర్‌డీవో కార్యాలయం ముందు వీవోఏల నిరసన

    గద్వాల రూరల్‌, అక్టోబర్‌ 29 : ఇందిరాక్రాంతి పథకంలో వీవోఏలుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వీవీ నర్సింహ్మ కోరారు. డీఆర్‌డీవో కార్యాలయం ముందు వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, కార్యదర్శి డ్యామ్‌ అంజితో కలిసి వారు నిరసన వ్వక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి, మీటింగ్‌ల నిర్వహణ, బుక్‌కీపింగ్‌ల నిర్వాహణకు వీవోఏలు కృషి చేస్తున్నారని తెలిపారు. రుణాల మంజూరుకు కావల్సిన పత్రాల సమర్పణ, సకాలంలో చెల్లింపు తదితర వాటికి మహిళా సంఘాలకు వారు సహకరిస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని బీమా, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌డీవో ఉమాదేవికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీవోలు హనుమంతు, నాగరాజు, మహేష్‌, శ్రీను, కృష్ణారావు, మహేశ్వరమ్మ, మంగమ్మ, కృష్ణవేణి, తిమ్మప్ప, జయన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T04:26:46+05:30 IST