మూడు కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-08-22T04:29:12+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనివారం 9,787 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
![మూడు కరోనా కేసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గద్వాల క్రైం, ఆగస్టు 21 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనివారం 9,787 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2301 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో 424 పరీక్షలు, నాగర్కర్నూలు జిల్లాలో 3,539 పరీక్షలు చేయగా ఒక్కరి కూడా కరోనా నిర్ధారణ కాలేదు. వనపర్తి జిల్లాలో 2783 పరీక్షలు, మహబూబ్నగర్ జిల్లాలో 740 పరీక్షలు చేయగా ఒక్కో కేసు నమోదైంది.