ప్రశ్నించే గొంతుక రాంచందర్‌రావు

ABN , First Publish Date - 2021-03-01T04:38:37+05:30 IST

శాసన మండలిలో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే బీజేపీ ఎమ్మెల్పీ అభ్యర్థి రాంచందర్‌ రావును గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు.

ప్రశ్నించే గొంతుక రాంచందర్‌రావు

- బీజేపీ నాయకులు - నేడు పేటకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక

నారాయణపేట, ఫిబ్రవరి 28 : శాసన మండలిలో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే బీజేపీ ఎమ్మెల్పీ అభ్యర్థి రాంచందర్‌ రావును గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మక్తల్‌, నారాయణ పేట లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిష న్‌రెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్నారని తెలిపారు. పార్టీ శ్రేణులు, పట్టభద్రులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అనం తరం ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు ప్రభాకర్‌వర్దన్‌, నందు నామాజీ, సత్యయాదవ్‌, అశోక్‌, వెంకటయ్య, ఉదయ భాను, ఉమేష్‌, మల్లయ్య పాల్గొన్నారు.

మక్తల్‌కు కిషన్‌రెడ్డి రాక

మక్తల్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం ఉదయం 10గంటలకు మక్తల్‌ పట్టణానికి వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, అర్బన్‌ మండల కమిటీ అధ్యక్షుడు బాయికాటి రాజశేఖర్‌రెడ్డి ఆదివా రం ఆంధ్రజ్యోతికి తెలిపారు. పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఆత్మీయ స మావేశం నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్సీఓటర్లు, పార్టీ కార్యకర్తలు రావాలని కోరారు. 

Updated Date - 2021-03-01T04:38:37+05:30 IST