బైకు అదుపు తప్పడంతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-11T04:42:27+05:30 IST
బైకు అదుపు తప్పి కింద పడటంతో వ్యక్తి మృతి చెందాడు.
ఉప్పునుంతల, మే 10 : బైకు అదుపు తప్పి కింద పడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి వెల్టూరు సమీపంలో చోటు చేసుకుంది. సోమవారం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్క ర్నూలు జిల్లా వంగూరు మండలం వెంకట్రాపూర్ గ్రామానికి చెందిన కాలూరు రాజు (32) అత్తగారి గ్రామమైన ఉప్పునుంతల మండంలోని వెల్టూరు గ్రామంలో ఉంటూ జీవనోపాధి కోసం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో వెల్డింగ్ వర్క్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ ద్విచక్రవాహనంపై రాకపోకలు సాగించేవా డు. అదేక్రమంలో ఆదివారం రాత్రి పనులు ముగించుకొని వెల్టూరుకు వస్తుండగా గ్రామ సమీపంలోని రహదారిపై రైతులు వడ్లు ఆరబెట్టి, రాత్రి ధాన్యం కుప్పలుగా పోసి తాటిపాలు కప్పారు. దీనిని గమనించని రాజు వడ్ల కుప్పను ఢీకొనడంతో బైక్ అదుపు తప్పి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ధాన్యం నూర్పిడి చేస్తే యంత్రం వాళ్లు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇ చ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తు న్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రహదారిపై వడ్లు ఆరబోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్...
బిజినేపల్లి : ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో గంగారం గ్రా మానికి చెందిన డ్రైవర్ కరుణాకర్ (25) సోమవారం మృతి చెందాడు. గ్రామస్థు లు తెలిపిన వివరాల ప్రకారం.. వసురాం తండా పంచాయతీ సర్పంచ్ లింబ్యా నాయక్ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా కరుణాకర్ కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ టైరు పంక్చర్ కావడంతో వేయించుకరావడానికి వసురాం తండా నుంచి చెరువు కట్టపై నుంచి గంగారం గ్రామానికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి చె రువులో బోల్తాపడింది. దాంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండు మూడు నెలల క్రితమే వివాహం అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.