ఇసుక డంపులు సీజ్‌

ABN , First Publish Date - 2021-06-23T04:39:41+05:30 IST

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అనే శీర్షిక మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం కాగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు మంగళవారం స్పందించారు.

ఇసుక డంపులు సీజ్‌
ఇసుక తరలింపు ప్రదేశాలను పరిశీలిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందం, జిల్లా అధికారులు

 మిడ్జిల్‌, జూన్‌ 22 : యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అనే శీర్షిక మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం కాగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు మంగళవారం స్పందించారు. గనులశాఖ సహాయ సంచాలకులు, ఆర్డీవో, డీఎస్పీల టాస్క్‌ఫోర్స్‌ బృందం తక్షణమే ఇసుక తవ్విన ప్రాంతాలను తనిఖీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఈ విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌ను అయన అదేశించారు. జిల్లా కలెక్టర్‌ వెంకటరావు అదేశాల మేరకు మైనింగ్‌ సహాయసంచాలకులు విజయ్‌కుమార్‌, మిడ్జిల్‌ తహాసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎస్సై జయప్రసాద్‌, ఇసుక తవ్విన ప్రాంతాలను తనిఖీ చేసి విచారణ నిర్వహించగా వారి విచారణలో వెలుగొమ్ముల గ్రామ శివారులోని పట్టాభూమి సర్వే నెంబర్‌ 30, 31లో ఇసుక తవ్వినట్లు తెలింది, తక్షణమే ఇసుక డంప్‌లను సీజ్‌ చేయటమే గాక రెవెన్యూ సిబ్బందిన కాపలా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు. 

Updated Date - 2021-06-23T04:39:41+05:30 IST