ఆలయ అభివృద్ధికి రూ.50వేలు విరాళం
ABN , First Publish Date - 2021-05-03T04:23:30+05:30 IST
వెంకటేశ్వర ఫర్టిలైజర్ యజమాని, సం గంబండ గ్రామ నివాసి వెంకట్రెడ్డి దంపతులు మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50వేల నగదును అందజేశారు. ఆ
![ఆలయ అభివృద్ధికి రూ.50వేలు విరాళం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921050210521340/05022021225233n43.jpg)
మక్తల్, మే 2 : వెంకటేశ్వర ఫర్టిలైజర్ యజమాని, సం గంబండ గ్రామ నివాసి వెంకట్రెడ్డి దంపతులు మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50వేల నగదును అందజేశారు. ఆలయ ధర్మకర్త భీమా చార్యకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడమటి ఆంజనేయస్వామి ఆలయం మక్తల్ పట్టణంలో ఎంతోప్రాశస్తి కలిగిందన్నారు. ఆలయంలో బండ లు వేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తన వంతుగా ఈ సహాయం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అర్చకులు అరవిందాచారి, వీహెచ్పీ ఉమ్మడి జిల్లాల సహాయ కార్యదర్శి భీంరెడ్డి పాల్గొన్నారు.