ఘనంగా పూలే వర్ధంతి
ABN , First Publish Date - 2021-11-29T03:54:21+05:30 IST
మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

నాగర్కర్నూల్ టౌన్, నవంబరు 28: మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల వసతి గృహం ఆవరణంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాశన్న మాట్లాడుతూ సమాజంలో అసమానతలు రూపుమాపడానికి, బడుగు, బలహీన వర్గా ల అభ్యున్నతికి తన జీవితాంతం పాటు పడిన మహనీ యుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆకాంక్షించా రు. సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు రామయ్య, హాస్టల్ వార్డెన్ రాధ, విద్యార్థినులు పాల్గొన్నారు.
పూలేకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాళి
మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్ర పటానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పూలే అడుగు జాడల్లో నడిచి సామాజిక అభివృద్ధి వైపు నేటి యువత అడుగులు వేయాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రాంథాలయాల సంస్థ చైర్మన్ మాధవరం హన్మంతరావు, టీఆర్ఎస్ ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్ర పటానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ పూల మాలలు వేసి ని వాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మ ల్లేష్గౌడ్, నాయకులు ప్రకాష్, బుడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.