ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-07-25T04:10:31+05:30 IST
ముని సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తం గా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఆత్మకూరు/అమరచింత/శ్రీరంగాపురం/పెద్దమందడి/పాన్గల్/వనపర్తి వైద్యవిభాగం/వీపనగండ్ల/కొత్తకోట జూలై 24: ముని సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తం గా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో మునిసిపల్ చైర్పర్సన్ గాయత్రి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యం లో కేక్కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టాక బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. వీపనగండ్ల, కల్వరాల, సంగినేనిపల్లి గ్రామాల్లో మొక్క లు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు నరసింహరెడ్డి, రఘు నాథరెడ్డి, మౌలాలి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సత్యనారా యణగౌడ్, డైరెక్టర్ వెంకటయ్య, పార్టీ అధ్యక్షుడు సర్దార్, కురుమ య్య తదితరులు పాల్గొన్నారు. కొత్తకోట మండల కేంద్రంతో పాటు అమడబాకుల, విలియం కొండ గ్రామ శివారులో జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, వైస్ చైర్మన్ వామన్గౌడ్, జడ్పీ సీఈవో వెం కట్రెడ్డి, డీఈవో రవీందర్, ఎంపీపీ గుంత మౌనిక తదితరులు మొక్కలు నాటారు.. కొత్తకోటలో మునిసిపల్ చైర్పర్సన్ సుకేశిని, వైస్ చైర్పర్సన్ జయమ్మ డివైడర్లో మొక్కలు నాటారు. శ్రీరంగాపురంలో ఎంపీపీ గాయత్రి, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ వినీలరాణి, ఎంపీటీసీ ఎల్లస్వామి, వార్డు సభ్యులు మొ క్కలు నాటారు. పాన్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో డీఆర్డీవో, జడ్పీటీసీ లక్ష్మీ, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీడీవో మొక్కలు నాటి నీరు పోశారు. పెద్దమందడిలో జిల్లా రైతు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి జడ్పీటీసీ రఘుపతిరెడ్డితో కలిసి కేజీబీవీ విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అమరచింత టీఆర్ఎస్ మండల నాయకులు అల్లిపూర్ రోడ్డులో ముక్కోటి వృక్షార్చనలో భాగంగా చైర్ పర్సన్ మంగమ్మ మొక్కలను నాటారు. పట్టణంలో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రమేష్ ముదిరాజ్ కేక్కట్ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్ ఆధ్వర్యంలో జనరి క్ మెడికల్ షాపు గార్డెన్లో శనివారం మొక్కలు నాటారు. గు రుపౌర్ణమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేం ద్రంలో రెడ్క్రాస్ సభ్యులు ఖాజా కుతుబుద్దీన్ను శాలువ పూల మాలలతో ఘనంగా సన్మానించారు.