మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-06-24T04:31:19+05:30 IST
ఏడో విడత హరిత హారం కార్యక్రమంలో జిల్లాలో 27లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ షేక్ యా స్మిన్బాషా ఆదేశించారు.
- కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా
వనపర్తి అర్బన్, జూన్ 23: ఏడో విడత హరిత హారం కార్యక్రమంలో జిల్లాలో 27లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ షేక్ యా స్మిన్బాషా ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాం బర్లో హరితహారంపై సమీక్షా సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ హరితహారంలో ఈ నెల 28లోగా జిల్లావ్యాప్తంగా 26లక్షల 78 వేల మొక్కలు నాటేందుకు తగు ప్ర ణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. అన్ని శాఖ ల అధికారులు అటవీ శాఖ ఆధ్వర్యంలో సమన్వయంతో పని చేసిన నిర్ణీత లక్ష్యాన్ని చే రుకోవాలన్నారు. రైతు వేదికలు, మునిసిపాలిటీలు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటా లన్నారు. ఆయా శాఖలకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలన్నారు. మొక్కలు ట్రీ గార్డులు వెంటనే ఏర్పాటు చేయాలని మొక్కల సంరక్షణ స్వీకరించాలని అన్నారు. హరితహారంపై నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏజేసీ వేణుగోపాల్, డీఆర్డీఏ నరసింహులు, మునిసిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి,, అన్ని జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.