నైపుణ్యం ఉన్న వారికే సభ్యత్వం

ABN , First Publish Date - 2021-10-14T05:44:14+05:30 IST

కులవృత్తిలో నైపుణ్యం కల్గి ఉంటేనే సంఘంలో సభ్యత్వం నమోదుకు అర్హులని మత్స్యకార సంఘం ఏడీ నాగులు పేర్కొన్నారు.

నైపుణ్యం ఉన్న వారికే సభ్యత్వం
మల్‌రెడ్డిపల్లి చెరువులో ఈత కొట్టేందుకు సిద్ధంగా ఉన్న మత్స్యకార సంఘం సభ్యులు

నారాయణపేట టౌన్‌, అక్టోబరు 13 : కులవృత్తిలో నైపుణ్యం కల్గి ఉంటేనే సంఘంలో సభ్యత్వం నమోదుకు అర్హులని మత్స్యకార సంఘం ఏడీ నాగులు పేర్కొన్నారు. బుధవారం దామరగిద్ద మండలం మల్‌రెడ్డిపల్లి గ్రామ చెరువులో మత్స్యకార సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్యంపై ఈత కొట్టడం, వల విసరడంపై పరీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దామరగిద్ద మండలం నుంచి దామరగిద్ద, సజనాపూర్‌, మల్‌రెడ్డిపల్లి, మద్దూర్‌ మండలం దుప్పడ్‌గట్‌, కొత్తపల్లి ఐదు గ్రామాల సభ్యులకు వృత్తి నైపుణ్యంపై జరిగిన పోటీలో 300 మంది పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, మత్స్యకార సంఘం సభ్యులు వెంకటప్ప, చందు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ముదిరాజ్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T05:44:14+05:30 IST