మరణంలోనూ వీడని బంధం

ABN , First Publish Date - 2021-08-11T04:50:39+05:30 IST

స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైర్డ్‌ కానిస్టేబుల్‌, ఆయన భార్య మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవర కద్ర మండలం చౌదర్‌పల్లి స్టేజీ సమీపంలో మంగళవారం చోటుచేసుకున్నది.

మరణంలోనూ వీడని బంధం
లక్ష్మీకాంత్‌రెడ్డి, నారాయణమ్మ (ఫైల్‌)

- స్కూటీని ఢీకొటి ్టన ఆర్టీసీ బస్సు 

- రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ దంపతుల మృతి


దేవరకద్ర, ఆగస్టు 10 : స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైర్డ్‌ కానిస్టేబుల్‌, ఆయన భార్య మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవర కద్ర మండలం చౌదర్‌పల్లి స్టేజీ సమీపంలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్‌ఐ భగవంత్‌ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కోయిలకొండ మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి (58) ఆయన భార్య నారాయణమ్మ (55)  కలిసి దేవరకద్ర మండల పరిధిలోని బస్వాయపల్లి గ్రామంలో ఉండే తమ కూతురి దగ్గరకు వెళ్లారు. తిరిగి మంగళవారం తమ గ్రామానికి స్కూటీపై వెళుతుండగా చౌదర్‌పల్లి స్టేజీ దగ్గర హైదరాబాద్‌ నుంచి నారాయణపేటకు వెళుతున్న నారాయణపేట డిపో ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొన్నది. దీంతో భర్యాభర్తలు అక్క డికక్కడే మృతి చెందారు. మృతుల కుమారుడి బాలవర్ధన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బస్సు డైవర్‌ రాజుగౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-08-11T04:50:39+05:30 IST