యాసంగిలో వరి సాగు చేయొద్దు
ABN , First Publish Date - 2021-12-08T04:54:04+05:30 IST
జిల్లాలోని రైతులు యాసంగిలో వరి పంటను వేసుకోవద్దని జిల్లా వ్యవసాయాధికారిణి వై.సుచరిత సూచించారు.
- జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత
పాలమూరు, డిసెంబరు 7 : జిల్లాలోని రైతులు యాసంగిలో వరి పంటను వేసుకోవద్దని జిల్లా వ్యవసాయాధికారిణి వై.సుచరిత సూచించారు. మంగళవారం ఆమె జిల్లాలోని బాలానగర్ మండలం నేరెళ్లపల్లిలో కల్లంలోని ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, సమస్యలు తెలుసు కున్నారు. వరికి బదులు నూనె గింజలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగలు, జొన్న, పెసర లాంటి పంటలను సాగుచేసుకోవాలన్నారు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, ప్రభుత్వం వరిని కొనదన్నారు. వరినే సాగు చేసుకుందామను కునే రైతులు ఉత్పత్తి, అమ్ముకోవడం సొంతంగానే చూసుకోవాలన్నారు. గతేడాది 1,20,097 హెక్టార్లకు గాను 1,03,400మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనమని తేల్చిచెప్పటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు సూచనలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన, పోస్టర్ విడుదల
చిన్నచింతకుంట : మండలంలోని వడ్డెమాన్ గ్రామంలోని రైతువేదిక వద్ద మంగళవారం ప్రత్యా మ్నాయ పంటల సాగుపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా, రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు యాసంగిలో ఏఏ పంటలు సాగు చేయాలన్న దానిపై ప్రభుత్వం రూపొందిం చిన పోస్టర్ను అధికారులు రైతులతో కలిసి విడు దల చేశారు. పప్పుదినుసులు, నూనెగింజలు, ఆయిల్పాం సాగుపై అధికారులు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్రెడ్డి, ఏఓ రాజేష్ఖన్నా, అప్పంపల్లి సింగిల్ విండో చైర్మన్ సురేందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.