రోడ్డు ప్రమాదంలో తుఫాన్‌-బైక్‌ ఢీ

ABN , First Publish Date - 2021-10-20T04:30:59+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తుఫాన్‌ వాహనం బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగ ళవారం సాయంత్రం మండలంలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో తుఫాన్‌-బైక్‌ ఢీ

- ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు


తెలకపల్లి, అక్టోబరు 19: రోడ్డు ప్రమాదంలో తుఫాన్‌ వాహనం బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగ ళవారం సాయంత్రం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ జి.మాధవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. బల్మూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిని శివకుమార్‌(28) అనే వ్యక్తి, అతని అన్న కుమార్‌లు ఇద్దరు కలిసి వారి బావ ఉప్పునుం తల మండలం లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణయ్యకు ఆరోగ్యం బాగా లేనందున చూసి రావడానికి అక్కడికి వెళ్లా రు. బైక్‌పై శివకుమార్‌, కృష్ణ య్యలు తెలకపల్లికి పనిమీద పోతుండగా మార్గమధ్యంలో రాకొండ గ్రామంలో ప్రైమరీ స్కూల్‌ ముందు ఎదురుగా వస్తున్న కేఏ22పీ1620 అనే నెం బరు గల తుఫాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని అతివేగంగా అజాగ్ర త్తగా నడుపుకుంటూ బైక్‌ను ఢీకొట్టాడు. కృష్ణయ్య తలకు,  ఇ తర చోట్ల బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిని శివకుమార్‌ కుడి మోకాలుపై భాగంలో, శరీరంలో అక్కడకక్కడా గాయాలు కాగా, వెంటనే  జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుడు సాయిని శివకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుఫాన్‌ డ్రైవర్‌ పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-20T04:30:59+05:30 IST