నారాయణపేట జిల్లాలో ఒకరికి కరోనా

ABN , First Publish Date - 2021-11-01T03:14:50+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నారాయణపేటలో 16 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

నారాయణపేట జిల్లాలో ఒకరికి కరోనా

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 31 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నారాయణపేటలో 16 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 320 కొవిడ్‌ పరీక్షలు చేయగా, ఎవరికీ పాజిటివ్‌ నిర్ధారణ కాలేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,202 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ఎవరికీ కరోనా సోకలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2,182 మందికి కరోనా పరీక్షలు చేశారు. అందరికీ నెగటివ్‌ వచ్చింది. వనపర్తి జిల్లాలో 2350 కొవిడ్‌ టెస్టులు చేశారు. ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. 

Updated Date - 2021-11-01T03:14:50+05:30 IST