పాఠశాలకు కుర్చీలు బహూకరణ
ABN , First Publish Date - 2021-11-27T04:58:22+05:30 IST
విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు జడ్చర్ల జడ్పీహెచ్ఎస్ 1986-87 సంవత్సరం విద్యార్థులు 25 కుర్చీలను శుక్రవారం బహూకరించారు.
జడ్చర్ల, నవంబరు 26 : విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు జడ్చర్ల జడ్పీహెచ్ఎస్ 1986-87 సంవత్సరం విద్యార్థులు 25 కుర్చీలను శుక్రవారం బహూకరించారు. ఉపాధ్యా యులు, విద్యార్థులకు కుర్చీలు అవసరమని తెలుసుకున్న పూర్వవిద్యార్థులు తమ వంతు గా 25 కుర్చీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్సీ ఉత్తీర్ణతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని పూర్వవిద్యార్థులు డి.శ్రీను, గుండు యాదయ్య, బాలస్వా మి, బుక్క శ్రీనివాసులు, బాలస్వామి, వజీర్, చంద్రశేఖర్ వెల్లడించారు.