వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-06-21T04:34:00+05:30 IST
వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏ.రాములు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మక్తల్ పట్టణానికి చెందిన బాలరాజ్చారీ(39) కొన్నేళ్లుగా అత్తగారి ఊరు పరిగిలో నివాసం ఉంటున్నాడు.
మక్తల్ రూరల్, జూన్ 20: వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏ.రాములు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మక్తల్ పట్టణానికి చెందిన బాలరాజ్చారీ(39) కొన్నేళ్లుగా అత్తగారి ఊరు పరిగిలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 16న మక్తల్కు వచ్చాడు. 17న పరిగికి వెళ్లేందుకు మక్తల్లో తమ్ముడు రవికుమార్ బస్సు ఎక్కించాడు. అప్పటి నుంచి బాల్రాజ్ కనిపించడం లేదు. బంధువులు, సన్నిహితుల ఇళ్లకూ వెళ్లలేదు. సోదరుడు రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.