ప్రశాంతంగా ఆర్జేసీ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2021-07-26T04:39:20+05:30 IST
మహాత్మజ్యోతిబా పూలే, వెనుకబడిన తరగతుల గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.
మహబూబ్నగర్, విద్యావిభాగం, జూలై 25: మహాత్మజ్యోతిబా పూలే, వెనుకబడిన తరగతుల గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 53 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పరీక్ష కొనసాగింది. ఆర్జేసీ పరీక్షకు సంబంధించి 7,402 మందికి 5,800 మంది, ఆర్డీసీకి సంబంధించి 946 మందికి 802 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని కోఆర్డినేటర్ లింగయ్య పరిశీలించారు.