బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ఎన్నిక
ABN , First Publish Date - 2021-01-13T03:16:04+05:30 IST
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా నూతన కమిటీని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఎన్నుకున్నారు.

వనపర్తి అర్బన్, జనవరి 12: బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా నూతన కమిటీని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్రెడ్డి, మాజీ అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి హాజర య్యారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాఘవేంద్రగౌడ్, ప్రధాన కార్యదర్శులుగా అశోక్, హనుమంతు, ఉపాధ్యక్షులుగా అశ్విని శ్రీనివాసులు, బాలస్వామి, రామకృష్ణ, ఓం ప్రకాష్ఆచారి, క్రాంతికుమార్ ఓబీసీ జిల్లా కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రగౌడ్, ఆశన్న, శరత్, చెన్నయ్య, నరేష్, కొండయ్య, ప్రచార కార్యదర్శిగా శివశంకర్, కార్యవర్గ సభ్యులుగా ప్రకాష్, ఆంజనేయులు, శివరాం, పరమేష్, రవిని ఎంపిక చేశారు.