ప్రతీ గ్రామంలో 50 మందికి ఉపాధి కల్పించాలి

ABN , First Publish Date - 2021-02-07T03:59:22+05:30 IST

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పథకం కింద 50మందికి తగ్గకుండా ఉపాధి కల్పించాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి ఆదేశించారు.

ప్రతీ గ్రామంలో 50 మందికి ఉపాధి కల్పించాలి

- అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 6 : జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పథకం కింద 50మందికి తగ్గకుండా ఉపాధి కల్పించాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌పై సమావేశం నిర్వహించారు. 17న ప్రజా ప్రతినిధు లను భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీ ఎస్‌లో తిరస్కరించిన చెల్లింపులను సరిచేయాలన్నారు. డీపీఓ మురళి, డిప్యూ టీ సీఈవో సిద్రామప్ప, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T03:59:22+05:30 IST