జైలు వాతావరణం సంతృప్తినివ్వాలి
ABN , First Publish Date - 2021-10-30T05:04:35+05:30 IST
శిక్ష అనుభవించేందుకు సబ్జైలుకు వచ్చిన వ్యక్తులకు అక్కడి వాతావరణం సంతృప్తినివ్వాలని 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎ్స.సాయిభూపతి అన్నారు

4వ అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి
సత్తుపల్లి, అక్టోబరు 29: శిక్ష అనుభవించేందుకు సబ్జైలుకు వచ్చిన వ్యక్తులకు అక్కడి వాతావరణం సంతృప్తినివ్వాలని 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎ్స.సాయిభూపతి అన్నారు. శుక్రవారం సత్తుపల్లి సబ్జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలు, వసతులు, భోజనం వివరాలు అడిగి తెలుసుకుని జైలు గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా ఎవరెవరు ఏ శిక్షపై వచ్చారు అని తెలుసుకుని భవిష్యత్పై భరోసాగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ హనుమంతరావు, న్యాయవాది విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.