బిచ్చమెత్తిన ‘తెలుగు యువత’

ABN , First Publish Date - 2021-08-02T05:48:14+05:30 IST

ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగాలు లేక.. రాష్ట్రంలో నిరుద్యోగులు నిరాశగా ఉన్నారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు నల్లమల రంజిత్‌ అన్నారు.

బిచ్చమెత్తిన  ‘తెలుగు యువత’
కార్లు, ఆటోల అద్దాలు తుడిచి బిచ్చమెత్తుతున్న టీడీపీ నాయకులు

ఖమ్మం మామిళ్లగూడెం, ఆగస్టు1: ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగాలు లేక.. రాష్ట్రంలో నిరుద్యోగులు నిరాశగా ఉన్నారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు నల్లమల రంజిత్‌ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నిరుద్యోగులు, తెలుగుయువత నాయకుల ఆధ్వర్యంలో కార్లు, ఆటోల  అద్దాలు తుడిచి బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌ కూల్చడం కట్టడం, ఎమ్మెల్యేలకు భవనాలు, కలెక్టరేట్‌ భవనాలు కడుతూ కమీషన్లు తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో మాత్రం మీనమేశాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు నల్లమల రంజిత్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, మధు తారక్‌, ఉప్పల ఉదయ్‌, కిరణ్‌కుమార్‌, మదన్‌ శ్రీనివాసరెడ్డి, నర్సింహ, శివ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T05:48:14+05:30 IST