వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోండి
ABN , First Publish Date - 2021-07-09T05:06:05+05:30 IST
పంటలసాగులో పెట్టుబడులు తగ్గించుకోవాలని కూసుమంచి ఏడీఏ విజయచంద్ర రైతులకు సూచించారు. పాలేరు గ్రామంలో బజ్జూరి వెంకటరెడ్డి పొలంలో ప్యాడీసీడర్ ద్వారా నేరుగా వరి విత్తనాలు వితంతడంపై రైతులకు అవగాహన కల్పించారు.

ఏడీఏ విజయచంద్ర, ఏవో వాణి
కూసుమంచి, జూలై 8: పంటలసాగులో పెట్టుబడులు తగ్గించుకోవాలని కూసుమంచి ఏడీఏ విజయచంద్ర రైతులకు సూచించారు. పాలేరు గ్రామంలో బజ్జూరి వెంకటరెడ్డి పొలంలో ప్యాడీసీడర్ ద్వారా నేరుగా వరి విత్తనాలు వితంతడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ విజయచంద్ర, ఏవో వాణి స్వయంగా దమ్ముచేసి, ప్యాడీసీడర్ పరికరం పొలంలో లాగి వరి విత్తనాలు నాటి చూపించారు. ఏడీఏ మాట్లాడుతూ డ్రమ్సీడర్ పద్ధతి ద్వారా 12కేజీల విత్తనాలు సరిపోతాయన్నారు. కూలీల అవసరం ఉండదని తెలిపారు. మొక్కల మధ్య సరైన దూరం ఉంటుందని గాలి, వెలుతురు సోకుతుందని, చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుందన్నారు. కలుపు నివారణకు ఫైరజో సల్ఫ్యురాన్ ఇధైల్ కలిపి పిచుకారీ చేయాలని సూచించారు. ఈపద్ధతి ద్వారా ఎకరాకు రూ10వేల నుంచి 12 వరకు ఆదాఅవుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవో జానీబాబ రైతులు పాల్గొన్నారు.