నవభారత్‌లో ఐఐఎం వార్షిక సమావేశం

ABN , First Publish Date - 2021-03-25T04:08:10+05:30 IST

పాల్వంచలోని నవభారత్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెటల్స్‌ (ఐఐఎం) పాల్వంచ వార్షిక విభాగం సర్వసభ్య స మావేశం బుధవారం నిర్వ హించారు.

నవభారత్‌లో ఐఐఎం వార్షిక సమావేశం
మాట్లాడుతున్న రమణారావు

పాల్వంచ, మార్చి 24: పాల్వంచలోని నవభారత్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెటల్స్‌ (ఐఐఎం) పాల్వంచ వార్షిక విభాగం సర్వసభ్య స మావేశం బుధవారం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ విభాగం అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడు తూ రోజురోజుకూ కర్మాగారా ల్లో మెటలార్జికల్‌ విభాగాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొ న్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో విభాగం కార్యదర్శి రమణారావు, ఎన్‌ఎండీసీ ప్రతినిధి నిశాంత్‌, సింగ రేణి ప్రతినిధులు జానకిరామారావు, ముత్యాల నాయుడు, రజనీకాంత్‌, పాలి టెక్నిక్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-25T04:08:10+05:30 IST