తండ్రిని చంపిన తయుడు
ABN , First Publish Date - 2021-06-17T05:02:44+05:30 IST
కన్నతండ్రినే ఓ కొడుకు హత్య చేశాడు. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం యం.వెంకటాయపాలెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలో దారుణం
ఖమ్మంరూరల్, జూన్16: కన్నతండ్రినే ఓ కొడుకు హత్య చేశాడు. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం యం.వెంకటాయపాలెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. యం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కొలిచలం రామచంద్రయ్య (70) లక్ష్మీదేవమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఉమాశంకర్కు 12 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాల తర్వాత వారి భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పటినుంచి వారిరువురు వేరువేరుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల మూలంగానే తన భార్య కాపురానికి రావటం లేదని ఉమాశంకర్ తల్లిదండ్రులతో తరుచూ గొడవపడుతూ, వారిని కొడుతూ ఉండేవాడని ఈ విషయంపై గ్రామపెద్దలు ఉమాశంకర్ను పలుమార్లు మందలించారు. అయిన ఉమాశంకర్లో ఎటువంటి మార్పు రాలేదు. మంగళవారం అర్ధరాత్రి ఉమాశంకర్ ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. తల్లి తనని వాదించలేక ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని నిదిరింది. ఈక్రమంలో ఆరుబయట నిద్రిస్తున్న తన తండ్రి రామచంద్రయ్యను విపరీతంగా కొట్టి, కండువాతో గొంతునులిమి తలను నేలకు కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి మృతిచెందాడని గ్రహించిన ఉమాశంకర్ అక్కడినుండి పారిపోయాడు. తెల్లవారుఝామున రక్తపు మడుగులో ఉన్న తన భర్తను చూసి భార్య బోరున విలపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.