టీఆర్‌ఎస్‌తోనే నిరుద్యోగ భృతి

ABN , First Publish Date - 2021-02-25T03:36:11+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉందని టీఆర్‌ఎస్‌ నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వ రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే నిరుద్యోగ భృతి

ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

పాల్వంచ, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉందని టీఆర్‌ఎస్‌ నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వ రెడ్డి అన్నారు. బుధవారం పాల్వంచలోని విద్యుత్‌ కళాభా రతి వద్ద వాకర్స్‌ను ఓట్లు అడిగేందుకు వచ్చిన రాజేశ్వరెడ్డి మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవీ కాలంలో నిరుద్యోగుల ప లు సమస్యలు పరిష్కరించామని అన్నారు. భవిష్యత్‌లో మ రిన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ స్యల పరిష్కారమే తన ధ్యేయమని పల్లా పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మాట్లాడుతూ పట్టభద్రు లంతా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేయాలని కోరారు. పల్లా రాజేశ్వ ర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బరపటి వాసు, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, కాంపెల్లి కనకేష్‌, రాజుగౌడ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T03:36:11+05:30 IST