సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన తుమ్మల
ABN , First Publish Date - 2021-06-18T05:40:21+05:30 IST
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఖమ్మం, జూన్ 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. 48వ చీఫ్ జస్టిస్గా ప్రమాణం స్వీకారంచేసి రాష్ట్రానికి వచ్చిన రమణను కలిసి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువారి కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని, న్యాయవ్యవస్థకు మరింత గౌరవం తేవాలని తుమ్మల ఆకాంక్షించారు. గతంలో న్యాయమూర్తిగా జస్టిస్ రమణ చేసిన సేవలు, ఇచ్చిన తీర్పులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్న తుమ్మల.. జస్టిస్ ఎన్వీ రమణకు భద్రాచల సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని అందించారు. తుమ్మల వెంట ఆయన తనయుడు యుగంధర్ కూడా ఉన్నారు.