భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అస్వస్థత

ABN , First Publish Date - 2021-10-29T06:42:29+05:30 IST

భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల ఆయన అస్వస్థతకు గురికావడంతో భద్రాచలంలోని వైద్యుల సూచనల మేరకు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అస్వస్థత
ఎమ్మెల్యే పొదెం వీయ్యను పరామర్శిస్తున్న భట్టివిక్రమార్క

పరామర్శించిన టీపీసీసీ నేత మల్లు భట్టి విక్రమార్క

భద్రాచలం, అక్టోబరు 28: భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల ఆయన అస్వస్థతకు గురికావడంతో భద్రాచలంలోని వైద్యుల సూచనల మేరకు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే వీరయ్యను టీపీసీసీ నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు. 


Updated Date - 2021-10-29T06:42:29+05:30 IST