ఐబీ ఈఈగా శ్రీనివాసరెడ్డి
ABN , First Publish Date - 2021-01-24T04:46:12+05:30 IST
సత్తుపల్లి నీటిపారుదల శాఖ డివిజన్ నెం.5లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరుగా ఎస్.శ్రీనివాసరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
సత్తుపల్లిరూరల్, జనవరి 23: సత్తుపల్లి నీటిపారుదల శాఖ డివిజన్ నెం.5లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరుగా ఎస్.శ్రీనివాసరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లాలోని జేసీఆర్ఎల్ఐఎస్ నుంచి డీఈఈగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై సత్తుపల్లి వచ్చారు. గతంలో ఖమ్మం ఎన్ఎ్సపీలో డీఈఈగా పనిచేశారు. సత్తుపల్లి ఈఈగా పనిచేస్తున్న ఆనందకుమార్ ఇటీవల ప్రమోషన్ పొంది సత్తుపల్లి ఎస్ఈగా పనిచేస్తున్నారు.