రైతుల గోడు పట్టించుకోని మంత్రి, అధికారులు: పువ్వాళ్ల

ABN , First Publish Date - 2021-05-20T05:49:02+05:30 IST

ఖమ్మంజిల్లాలోని ధాన్యం రైతుల గోడును జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులెవరూ పట్టించుకోవడం లే దని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ విమర్శించారు.

రైతుల గోడు పట్టించుకోని మంత్రి, అధికారులు: పువ్వాళ్ల
రెబ్బవరంలోని కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న దుర్గాప్రసాద్‌

వైరా, మే 19: ఖమ్మంజిల్లాలోని ధాన్యం రైతుల గోడును జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులెవరూ పట్టించుకోవడం లే దని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ విమర్శించారు. మండలంలోని రెబ్బవరం పలు గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులను బుధవారం దుర్గాప్రసాద్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతులు, లారీల కొరత వంటి సమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఫలితంగా జిల్లాలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేలకొండపల్లిలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని ఓ రైతు ఆత్మహత్యాప్రయత్నం చేసుకోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. తాలు ఇతర కారణాలు చూపుతూ మిల్లర్లు 7నుంచి 10కిలోల వరకు ధాన్యాన్ని కట్‌చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ దాసరి దానియేలు, వైరా సొసైటీ డైరెక్టర్‌ పసుపులేటి హ న్మంతరావు, నాయకులు గుత్తా రామారావు, వెంకటేశ్వర్లు, దేవరపల్లి వేణు, బ్రహ్మరాశి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-20T05:49:02+05:30 IST